తల్లి కోసం బైక్ ఫై 2346 కిలోమీటర్లు ప్రయాణం

ఓ కుమారుడు తన తల్లి కోసం 2,346 కిలోమీటర్ల మేర బైక్‌ ప్రయాణం చేశాడు. కానీ తల్లి వద్దకు వెళ్లేందుకు తమిళనాడు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. గుజరాత్‌ నుంచి తమిళనాడు వరకు మండుటెండలో తల్లి కోసం ప్రయాణించినప్పటికీ.. నిరాశే ఎదురైంది. తమిళనాడులోని శిర్కాజీకి చెందిన చంద్రమోహన్‌(43).. అహ్మదాబాద్‌లో సివిల్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా పనులు నిలిచిపోవడంతో.. అక్కడ ఒంటరిగా ఉంటున్నాడు. ఉదయం, రాత్రి ఎన్జీవోలు ఇచ్చే ఆహారంతో సరిపెట్టుకుంటున్నాడు. చంద్రమోహన్‌ తల్లి, భార్యాపిల్లలు మాత్రం తమిళనాడులో ఉంటున్నారు. గ్లకోమా కారణంగా తల్లి కంటి చూపు కోల్పోయింది. ఈ మధ్యే ఆమె అనారోగ్యానికి గురైంది. దీంతో తల్లిని చూడాలని చంద్రమోహన్‌ అహ్మదాబాద్‌ నుంచి తమిళనాడుకు తన హీరో హోండా బైక్‌పై బయల్దేరాడు. ఈ ప్రయాణానికి అహ్మదాబాద్‌ అధికారుల నుంచి అనుమతి పత్రం పొందాడు చంద్రమోహన్‌.