mla కారులో మద్యం !

బీహార్ లో రోజు రోజుకు కరోనా విస్తరిస్తోంది.  కరోనా నుంచి బయటపడేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.  మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చిన తరువాత జనాలు రోడ్డుమీదకు వస్తున్నారు.  బీహార్ రాష్ట్రంలో మధ్యపాన నిషేధం పక్కాగా అమలు అవుతున్న సంగతి తెలిసిందే.. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో మద్యం ప్రత్యేక్షం అవ్వడం అక్కడి పోలిసులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదే పెద్ద షాక్ అంటే పోలీసులకి మరో పెద్ద షాక్ తగిలింది. ఆ మద్యం బీహార్ లోని ఓ ఎమ్మెల్యే కారులో ప్రత్యేక్షం అవ్వడం.. ఇక వివరాల్లోకి వెళ్తే.. బుధవారం సిమ్రీలో వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్న సమయంలో బుక్సర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తివారీకి చెందిన కారులో ఎనిమిది సీసాల మద్యం దొరకడంతో పోలీసులు మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని బక్సర్ పోలీసు సూపరింటెండెంట్ ఉపేంద్ర నాథ్ శర్మ తెలిపారు.
దీనిపై బక్సర్ ఎమ్మెల్యే మరియు మరో ఏడుగురిపై సిమ్రీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.అయితే వాహన తనిఖీ సమయంలో ఎమ్మెల్యే తివారీ కారులో లేరు. అయితే లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుండి, నా కారు నిరుపేదలకు రేషన్ పంపిణీ చేయడానికి ఉపయోగించబడుతోందని, ఇందులోకి మద్యం ఎలా వచ్చిందో తనకు తెలియదని, ఇది ఓ రాజకీయ కుట్ర అని, దీనిపైన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సదరు ఎమ్మెల్యే వాపోతున్నారు. ఇక ప్రస్తుతం పోలీసులు ఇప్పుడు మద్యం ఎక్కడ నుండి కొన్నారు, ఎక్కడికి తీసుకెళ్లారు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

Sanjay Kumar Tiwari , congress mla Sanjay Kumar Tiwari , Liquor Bottles Seized From Bihar Congress MLA’s Car, seven people have been arrested, telugu news