కేంద్రం 20 లక్షల కోట్ల ఫార్ములా ఇదేనా…
కరోనాతో ప్రపంచమే విలవిల్లాడుతుంది. చైనాలో పురుడుపోసుకున్న ఈ మహమ్మరి ప్రస్తుతం మానవ జాతిని అతలాకుతలం చేసేస్తుంది. గత మూడు నెలలుగా ఈ వ్యాధి ప్రజల్ని వెంటాడుతుంది. ఇప్పటికే లక్షల్లో ప్రాణాలను బలి తీసుకుందీ కరోనా. ఇక దీని కారణంగా మన భారత దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు ప్యాకేజీలంటూ ముందుకొస్తున్నాయి. కానీ వారు ప్రకటించే ప్యాకేజీలు నిజంగా సామాన్యుడికి ఉపయోగపడుతున్నాయా…వారు ప్రకటించే లక్షల కోట్ల రూపాయలు పేదోడి ఆకలి తీరుస్తున్నాయా అనే ప్రశ్న ప్రముఖంగా వినిపిస్తుంది. ఇక తాజాగా కేంద్రప్రభుత్వం 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది. మరి ఈ సారైనా అది పేదోడికి చేరుకుందా అంటే చేరదనే చెప్పాలి. ఒక్కమాటలో చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆ 20 లక్షల కోట్ల రూపాయలు పరిస్థితి ఇలా ఉండబోతుందని అంచనా.
కేంద్ర ఇచ్చిన 20 లక్షల కోట్ల ప్యాకేజీలో ఎవరికి ఎంత ?
20 రూపాయలు పేదోడికి
లక్ష రూపాయలు వ్యాపారవేత్తలకి
కోటి రూపాయలు పొలిటిషన్స్కి
ఇది 20, లక్ష, కోట్ల ఫార్ములా
LATEST NEWS, TELUGU NEWS, CENTRAL GOVT LATEST NEWS, TOP NEWS