గ్యాస్‌ లీకేజీ ఘటనపై కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

విశాఖ గ్యాస్‌ లీకేజీ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు,  మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అస్వస్థతకు గురైన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి గ్యాస్‌ లీకేజీ కావడం దురదృష్టకరమని సీఎం అన్నారు.విశాఖ గ్యాస్‌ లీకేజీ ఘటనపై తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ విచారం వ్యక్తం చేశారు. అక్కడ చోటు చేసుకున్న పరిమాణాలను వీడియోల్లో చూస్తే షాక్‌కు గురయ్యాయనని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనలో తమ అత్యంత ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు కోలుకోవాలని ప్రార్థించారు. ఇదో భయంకరమైన సంవత్సరం అని కేటీఆర్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Telugu news, Telanagana CM Latest news on Gas gas leakage ,KCR,KTR shocked over Gas leakage ,Latest News